

నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి:ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
ప్రజాగళం రోడ్డుషో నిర్వహణకు సన్నాహక సమావేశం
సత్తెనపల్లిలో ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాగళం కార్యక్రమం, పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో రోడ్డుషో కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంకి సంబంధించి రూట్ మాప్ విధివిధానాలు, నాయకులకు దిశా నిర్దేశం చేసి, గ్రామాలలో నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు, యువతకు తెలియజేసి పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలి అని కోరారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించి,పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ పదవులలో ఉన్న నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్,పార్టీ అనుబంధ విభాగాలు అయిన తెలుగు యువత, టి. ఎన్. యెస్. ఎఫ్., తెలుగు మహిళ, తెలుగు రైతు, ఐటీడీపి,జనసేన, బీజేపీ, నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ,పట్టణ, మండల, గ్రామ నాయకులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.