
నారద వర్తమాన సమాచారం:క్రోసూరు: ప్రతినిధి
వై యస్ ఆర్ సి పీ లో చేరిన కొండూరు టీడీపీ నాయకులు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆలా శ్రీనివాసరావు,ఆలా ఆంజనేయులు,గుడారు శ్రీరాములు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. క్రోసూరు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు.