
నారద వర్తమానసమాచారం :ప్రతినిధి
సామాజిక ఉద్యమ కెరటం జ్యోతిరావు పూలే .
గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.
జోహార్ పూలే అంటూ నినదించిన తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
విజయవాడ రూరల్ మండలం
సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు.విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెదేపా కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ పూలే అంటూ నినదించారు.మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.
మహాత్మా జ్యోతిరావ్ పూలే వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలేకు కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఘన నివాళులర్పించారు.