
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఘనంగా మహాత్మ జ్యోతిరావుఫూలే జయంతి
మహాత్మ జ్యోతిరావు పూలే జాతికి చేసిన సేవలు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. జ్యోతిబా పూలే జయంతి వేడుకలు గురువారం పట్టణంలోని బ్యాంకు నగర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కావటి మనోహర్ నాయుడు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ గొంటు శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్న, నాయకులు మారుబోయిన నాగరాజు, నకరికంటి శ్రీకాంత్, సాఫా సైదావలి, జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు, కోటిరెడ్డి, మంగు ఏడుకొండలు, పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, బుక్కాపురం రవి, సంక్రాంతిపాడు వెంకట్, తాళ్ల అంజిరెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.