18 ఏళ్లు నెలలో ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా వేయాలి
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విప్ కార్యక్రమం లో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 23,
18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశి వనంలో మంగళవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విఫ్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మతాలకతీతంగా ఓటు వేయాలని చెప్పారు. ఓటు వేయడం ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం ఓటర్ సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులతో సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, జిల్లా అధికారులు రాజారాం, వరదారెడ్డి, వెంకట్ రెడ్డి, సాయిలు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు లింగం, బాలయ్య, శంకర్, రాజ్ గంభీర్ రావు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.