Tuesday, February 18, 2025

అపూర్వం.. అద్వితీయం1997-98 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనంఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

అపూర్వం.. అద్వితీయం
1997-98 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం
ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

నారదా వర్తమాన సమాచారం :
నిజామాబాద్ జిల్లా
కమ్మర్ పల్లి , మే 5:

వారంతా నాలుగు పదుల వయస్సున్న వారే.. బాధ్యతల్లో తీరిక లేకుండా గడిపే వారే.. అలాంటి వారంతా ఒక్కసారిగా పసి పిల్లలుగా మారిపోయారు. పాతికేళ్ల నాటి ఆపాత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆడిపోయారు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్లో ఆదివారం జరిగిన 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అద్భుతంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. పాతికేళ్ల క్రితం విడిపోయిన మిత్రులంతా రెండున్నర దశాబ్దాల తర్వాత కుటుంబాలతో సహా కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులను చూసి ఉప్పొంగిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోటకు చేరారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బాల్య మిత్రులతో సరదాగా గడిపారు. అనుకోని రీతిలో కోల్పోయిన సహచరులను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.
తమకు మార్గదర్శనం చేసిన ఆనాటి గురువులను ఘనంగా సత్కరించారు. వారు చెప్పిన బోధనలు తమ జీవితాలకు ఎలా బాటలు వేశాయో సోదాహరణంగా వివరించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి , నాగయ్య, రుక్మయ్య, పురుషోత్తం శర్మ, సురేశ్బాబు, ధర్మారెడ్డ, లింబాద్రి, గంగారం, ప్రతాప్ గౌడ్, విజయలక్ష్మి, బాబురావు, అంజయ్య కు ఆత్మీయ సత్కారం చేసి, దీవేనలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు సైతం మురిసి పోయారు. వయస్సు మరిచి వారితో కలిసి పోయారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి,మహేందర్ గౌడ్ రేవతి గంగారెడ్డి శ్రీధర్ రెడ్డి విట్టల్ ,ఉదయ్,తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading