
నారద వర్తమాన సమాచారం
సమష్టి కృషితో తెలుగుదేశం జెండా ఎగురవేద్దాం: ప్రత్తిపాటి
ఎన్నికల పోలింగ్ ముగిసేంతవరకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి చిలకలూరిపేటలో భారీ మెజార్టీతో తెలుగుదేశం జెండా ఎగురవేద్దామని మాజీమంత్రి, కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు ఏడుకు ఏడు ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెలిపారు. చిలకలూరిపేట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా చిలకలూరిపేట మండలం పోతవరానికి చెందిన సర్పంచ్, వైసీపీ నాయకుడు మౌలాలితో పాటు 22 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాయి. మండల పార్టీ అధ్యక్షుడు జవ్వాజి మదన్మోహన్, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.