Tuesday, May 20, 2025

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు సజీవ దహనం 20 మందికి తీవ్రగాయాలు..

నారద వర్తమాన సమాచారం

ఓటు వేసి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 20 మందికి తీవ్రగాయాలు..

మే :15

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం దగ్గర ఓ లారీ-ప్రైవేటు బస్సు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవ దహనమయ్యారు.

ప్రమాదానికి గురైన బస్సు.. బాపట్ల జిల్లా చినగంజాం నుండి హైదరాబాద్‌ వెళ్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఓటు వేయడానికి సొంతూర్లకు వచ్చి.. తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది.

మద్యంమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

కళ్లు తెరిచేలోపే..అగ్నికీలలకు బస్సు ఆహూతయిందని ప్రయాణికులు వాపోతున్నారు.

గాఢ నిద్రలో ఉన్నవాళ్లు..నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై.. 108తో పాటు పోలీసులకు సమాచారం చేరవేశారు.

ప్రమాదానికి గురైన అరవింద ట్రావెల్స్‌ బస్సు.. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.

మృతులను బస్సు డ్రైవర్‌ అంజితో పాటు ఉప్పుగుండూరు కాశీయ్య, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page