
నారద వర్తమాన సమాచారం
తెలంగాణలో 203 కొత్త ప్రభుత్వ పాఠశాలలు?
హైదరాబాద్
:మే 18
తెలంగాణలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధి లో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంచాయతీకి కనీసం ఒక ప్రభుత్వ పాఠశాల తప్పని సరని, దానిపై నివేదిక సమర్పించాలని గతంలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే 257 పంచాయతీల్లో పాఠ శాలలు లేవని డీఈఓలు ప్రాథమిక నివేదిక అందజేశారు.
వాటిల్లో 122 చోట్లే అవి అవసరమని పేర్కొన్నారు. దానిపై మరోసారి క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను శుక్రవారం ఆదేశించింది…