
నారద వర్తమాన సమాచారం
పార్వతి బ్యారేజ్ లో నీటిమట్టం ఖాళీ: చేపలు పడుతున్న గ్రామస్తులు
తెలంగాణ
పెద్దపల్లి జిల్లా
:మే 21
మంథని మండలం సిరి పురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజ్ నుండి నీటిని అధికారులు ఖాళీ చేస్తు న్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును మరమ్మతులు చేసేందుకు నీటిని గోదావరిలోకి దిగువకు వదులుతున్నారు.
పార్వతి ప్రాజెక్టులోని నీటిమట్టం పూర్తిగా ఖాళీగా అవుతోంది. దీంతో చుట్టు పక్కల గ్రామస్తులు చేపలు పట్టే పనిలో పడ్డారు.
ప్రస్తుతం గేట్ల వద్ద ఒక మీటర్ నీరు మాత్రమే నిల్వ ఉంది..