
నారద వర్తమాన సమాచారం
జూన్ :02
కారంపూడి సీఐ నారాయణ స్వామిపై వేటు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణ స్వామిపై ఈసీ వేటు వేసింది.
ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలని ఆదేశించింది.
పోలింగ్ రోజున కారంపూడిలో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపణలు రావడంతో వేటు పడింది.
తదుపరి విచారణ ఆధారంగా సీఐపై చర్యలు ఉండనున్నాయి.








