Tuesday, May 20, 2025

రైతు పెట్టుబడి సాయం వెంటనే అందించాలి : కొండమడుగు నరసింహ

రైతు పెట్టుబడి సాయం వెంటనే అందించాలి : కొండమడుగు నరసింహ

నారద వర్తమాన సమాచారం

: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:


సమావేశంలో మాట్లాడుతున్న కొండమడుగు నరసింహ

వర్షాకాలం మొదలైన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహా అన్నారు. పట్టణ కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మండల పట్టణ కమిటీల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది దొడ్డు రకం వడ్లు పండిస్తుండగా సన్నాలకు బోనస్ ఇస్తామనడం సమంజసం కాదన్నారు. రైతులకు సబ్సిడీలపై విత్తనాలను అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలో ఈనెల 15, 16 తేదీల్లో జరిగే జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పగిళ్ల లింగారెడ్డి, కోడె బాల నరసింహ, కోట రామచంద్రా రెడ్డి, మంచాల మధు, నెలకంటి జంగయ్య, నోముల కృష్ణారెడ్డి, కందుకూరి బిక్షపతి, కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి పాల్గొన్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page