
నారద వర్తమాన సమాచారం
జూన్ :12
వైసీపీ గెలుపుపై కోట్లలో పందెం.. పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య
కడప – ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వెంకట సుబ్బారావు(52) అనే వ్యక్తి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ గెలుస్తుందని కోట్లల్లో పందేలు కాసి, వేరే వాళ్లు పందెం కాస్తే మధ్యవర్తిగా ఉన్నాడు.
ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి విజయవాడ కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.