
నారద వర్తమాన సమాచారం
దేశ్ ముఖ్ లో ఉచిత పిల్లల వైద్య శిబిరం
పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందం
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండలంలోని దేశ్ ముఖ్ గ్రామంలో ఆదివారం కలర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ దుర్గం నరేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ షుగర్, బీపీ, బ్లడ్ గ్రూపింగ్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్ అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసు, శ్రీ,డాక్టర్ నరేష్, ఎంపిటిసి చిల్లర జంగయ్య యాదవ్, సర్పంచ్ దుర్గం మాధురి మచ్చేందర్ యాదవ్, నాయకులు గుండాల రాజారాం, దాసర్ల జంగయ్య, జక్కుల శంకర్ యాదవ్, కనుమోని కుమార్ యాదవ్, దుర్గం శంకర్ తదితరులు ఉన్నారు.