
నారద వర్తమాన సమాచారం
మృతుడి కుటుంబానికి పరామర్శ
మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నాయకులు
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు చింతల శ్రీశైలం పెద్ద కుమారుడు చింతల శ్రవణ్ ఆదివారం తెల్లవారుజామున వారి నిమిత్తం హైదరాబాద్ బైక్ పై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పెద్ద అంబర్పేట్ డివైడర్ వద్ద ఢీకొని తీవ్రంగా గాయపడగా హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహం గ్రామానికి చేరుకోగా, ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బండ కృష్ణ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. వీరితోపాటు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధవరెడ్డి, నాయకులు మేకల చొక్కా రెడ్డి, గరిస జంగయ్య, రాజనారాయణ, పెద్దిరెడ్డి యాదగిరి తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.