నారద వర్తమాన సమాచారం
ఆపదలో ఉన్న నిరుపేద మహిళకు ఆర్థికసహాయం చేసిన అమ్మఫౌండేషన్ సేవా సంస్ధ
కొమరోలు మండలం తాటిచర్ల పంచాయతీలో నివాసముంటున్న పళ్ళాల భాగ్యమ్మ అనే మహిళ భర్తచనిపోయి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో వారికి అమ్మ ఫౌండేషన్ ద్వార ₹5000రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం అని గ్రామస్తులు సమక్షంలో అమ్మ ఫౌండేషన్ సేవాసంస్థ అధ్యక్షులు బోనేని వేంకటేశ్వర్లు యాదవ్ హామీ ఇచ్చారు. కాగ భాగ్యమ్మ అనారోగ్యం తో బాధ పడుతున్న విషయాన్ని
గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుబొనేని వేంకటేశ్వర్లు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆమెను పలకరించి అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని భాగ్యమ్మకు అందజేశారు.
ఆర్ధికసాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులకు బాధితురాలు భాగ్యమ్మ, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పందిళ్ళ నాగార్జున, బుడయ్య, రవితేజ,రంగమ్మ, వెంకటస్వామి, తిరుమలయ్య ,భాలసుబ్బయ్య , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.