నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళలో లెనిన్ నగర్,మారుతి నగర్ ల నందు డయేరియా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో ఆ ఏరియాలో పర్యటించి డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కలెక్టర్ అరుణ్ బాబు
మున్సిపల్ అధికారులు తక్షణమే పారిశుద్యం పనులు నిర్వహించాలని డయోరియా ప్రబలకుండా శానిటైజేషన్ చేయాలని అదికిరులను హెచ్చరించారు అలాగే
పిడుగురాళ్ల పట్టణంలో డయేరియా అదుపునకు కట్టుదిట్టమైన చర్యలు చేప్పట్టాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక ఆర్అండ్ బి బంగ్లాలో మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అలాగే వైసీపీ భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అన్నారు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.