నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్.. వయా రాజధాని అమరావతి
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ప్రస్తుతం ఉన్న ఆరు లైన్ల జాతీయ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చి.. గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దేందుకు ఏపీ, తెలంగాణ సీఎం లు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఈ ప్రతిపాదనను త్వరలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి దృష్టికి తేనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మాత్రమే కాక సరుకు రవాణాకు సైతం ఈ ప్రతిపాదన దోహదపడుతుందన్నది ఇరు రాష్ట్రాల సీఎం ల అభిప్రాయం. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రోడ్డు కనెక్టివిటీని పెంపొందించే అంశాన్ని విభజన చట్టంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రోడ్డు కనెక్టివిటీ గతంతో పోలిస్తే మెరుగుపడినా ఇప్పుడు అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలన్నది రెండు రాష్ట్రాల ప్రతిపాదన.
అనుమతుల విషయంలో చంద్రబాబు చొరవ
కేంద్రానికి అధికారకంగా ప్రతిపాదనలు వెళ్లిన తర్వాత అనుమతుల విషయంలో చంద్రబాబునాయుడు చొరవ తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న ఆరు లైన్లను ఎనిమిది లైన్లకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ విషయంలో రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.