హైదరాబాద్ లో మళ్లీ తుపాకుల మోత
తెలంగాణ
హైదరాబాద్ నగరంలో తుపాకుల మోత మళ్లీ కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి ఈ కాల్పు ల ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు.
దీంతో ఒక్కసారిగా పోలీ సులపై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయ త్నించగా..వారిపై పోలీ సులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అతన్ని ఉస్మానియా ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.