నారద వర్తమాన సమాచారం
అమరావతి
పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
పశువుల పెంపకందారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది.
యూనిట్కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘గోకులం’ పేరుతో దీన్ని అమలు చేయనుంది.