Tuesday, May 20, 2025

పరీక్ష ఏదైనా ఫలితం ఐఎసిఈ తో నే సాధ్యం: చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి.

నారద వర్తమాన సమాచారం

పరీక్ష ఏదైనా ఫలితం ఐఎసిఈ తో నే సాధ్యం: చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఐఎసిఈ సంస్థ విజయకేతనం.

ఎల్ బీ నగర్

పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులకు ఐఎసిఈ సంస్థ దిక్సూచిగా నిలుస్తుంది అని, పరిక్ష ఏదైనా ఫలితం ఐఎసిఈ తోనే సాధ్యం అని సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐఎసిఈ సంస్థల విజయోత్సవ శ్రీ సత్యసాయి మండపంలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసరావు లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
పరీక్ష ఏదైనా ఫలితం ఐఎసిఇ తోనే సాధ్యమని మా విద్యార్థులు నిరూపించారని అని అన్నారు..,ఉద్యోగ సాధనలో విద్యార్థులు వేసే ప్రతి అడుగులో చివరి వరకు సంస్థ తోడుగా ఉంటూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.
సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ బ్రాంచ్ లు అమీర్ పేట,కే పి హెచ్ బీ విద్యార్థులు సాధించిన పలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతో సంతోషాన్నించిందని, ఐఎసిఈ కి రెండు తెలుగు రాష్ట్రాలలో 9 బ్రాంచ్ లు ఉన్నాయని, వేలాదిమంది విద్యార్థులు ప్రతి సంవత్సరము శిక్షణ పొందుతూ పలు ఉద్యోగలు సాధిస్తున్నారని అని అన్నారు. రానున్న రోజుల్లోనూ రైల్వే, ఎస్ ఎస్ సి, బ్యాంకింగ్, వంటి రంగాలలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని విద్యార్థులు శిక్షణ పొంది ఈ ఉద్యోగాలు సాధించవచ్చు అని తెలిపారు.
పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన మా పిల్లలు ఈ వేదికగా తల్లిదండ్రులను సత్కరించడము ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ,కొద్దిపాటి ఫీజులతోనే జాబ్ వచ్చేంతవరకు శిక్షణ ఇవ్వడం అన్నది ఐ ఎ సి ఈ కె సాధ్యమని కొనియాడారు.
ఉన్నత ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు చైర్మన్ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page