నారద వర్తమాన సమాచారం
అంధ బాలికల రక్షణకు చర్యలు తీసుకోవాలి
సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి
మలక్ పేట్ బీ బ్లాక్ క్వార్టర్స్ లోని ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న బాలికల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం, వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి డిమాండ్ చేసారు. శనివారం ఆమె డివిజన్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహాన్ని సందర్సించారు. అక్కడి బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సహచర బాలికపై జరిగిన అకృత్యానికి భయపడుతున్న బాలికలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కార్పొరేటర్ గా ఉన్న సమయంలో బాలికల వసతి గృహాన్ని తరచూ సందర్శించామని తెలిపారు. ఇక్కడి బాలికలకు తాము ఎప్పటికీ అండగా ఉంటామన్నారు. హాస్టల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.