Tuesday, February 4, 2025

సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం.రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు…

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం.రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు

సత్తెనపల్లి నియోజకవర్గ పరిధి రాజుపాలెం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన బలిజేపల్లి గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అనంతరం జరిగిన చిన్న చిన్న సంఘటన వలన ఇరు వర్గాల వారు గొడవలు పడకుండా ఉండాలని ముందస్తు చర్యలో భాగంగా శనివారం సాయంత్రం పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఎన్నికలను మర్చిపోవాలన్నారు. అల్లర్లకు పాల్పడి గొడవలు చేయొద్దని యువత అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలని, ఎలక్షన్ కి ముందు కొందరి పైన బైండోవర్ కేసులు కూడా చేశామని అయినప్పటికీ కొందరు గొడవల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు.కొంతమంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు. చదువుకునే విద్యార్థులు కూడా గొడవల్లో తలదుర్చుతున్నారు.పాత కేసుల పైన,రౌడీ షీటర్ల పైన,సస్పెక్ట్ షెటర్ల పైన ప్రత్యేక నిఘా కలిగి ఉన్నామని తెలియజేశారు. అన్ని సమస్యత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని గొడవలకు పాల్పడిన వారిని సిసి కెమెరా ఆధారంగా గుర్తిస్తామని ఎవరైనా చట్టాలను అతిక్రమించి నేరాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేరాలకు పాల్పడిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. రాంబాబు తో పాటు ముప్పాళ్ళ ఎస్సై పి.హాజరత్తయ్య, నెకరికల్లు ఎస్సై నాగేంద్ర, మూడు మండలాల పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading