రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.
నిర్మల్
నారద వర్త మాన
సమాచారం
అడ్వకేట్ జగన్ మోహన్ బిఎస్పి నిర్మల్ జిల్లా ఇంచార్జీ.
ఎన్నికల్లో పలు రకాల హామీలు ఇచ్చి ఎన్నికల అయ్యాక రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైంసా పట్టణంలో జగన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ….రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఏలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు.పాత రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని అన్నారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్లు రుణమాఫీ చేస్తున్న కేంద్రం రైతులకు రావాల్సిన పథకాలన్నీ రద్దు చేయడం చాలా దారుణమని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.