నారద వర్తమాన సమాచారం
ఆకాశాన్ని తాకిన పూల ధరలు
ప్రజల భక్తిని.. అవసరాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారస్తులు
శ్రావణ మాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతం కారణంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి.
దీనికి వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమూ ప్రభావం చూపుతోంది. గత నెలలో మల్లెల ధర కేజీ రూ 550లు ఉండగా ఇప్పుడు రూ 1,500 పలుకుతోంది.
తెల్ల చామంతి రూ 200 నుంచి రూ 350, పసుపు చామంతి రూ 150 నుంచి రూ 400, కనకాంబరం
రూ 100 నుంచి రూ 300, లిల్లీ రూ 150 నుంచి రూ 500, జాజులు రూ 300 నుంచి రూ 1,200కు చేరాయి.
దీంతో కొనలేక.. కొనక తప్పలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.