Tuesday, July 22, 2025

పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు.

నారద వర్తమాన సమాచారం

వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది..

పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు.

మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఆమె పసుపు కండువా కప్పుకున్నారు.

పద్మశ్రీతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్దిని చూసే నేతలు తమ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. ఘంటా పద్మశ్రీ భర్త, వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ ప్రసాదరావు ఇప్పటికే టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

పద్మశ్రీ దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 48 కాగా వీరవాసరం, ఆచంట స్థానాల్లో జనసేన, టీడీపీ గెలిచింది. ఇక మిగిలిన 46 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ టీడీపీలో చేరడంతో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి చేరగా.. జెడ్పీ పీఠంపైనా పసుపు జెండా ఎగిరే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలువురు జెడ్పీటీసీలు టీడీపీలో చేరగా.. మరికొందరు కూడా త్వరలో అదే బాటలో నడవబోతున్నట్లు తెలుస్తోంది.
ఘంటా పద్మశ్రీ, ప్రసాదరావు దంపతులు ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు జనసేన పార్టీలో చేరతామని ప్రకటించారు.. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుని తెలుగు దేశం పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ముందు ఘంటా ప్రసాదరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఇవాళ పద్మశ్రీ కూడా అదేబాటలో నడిచారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాజీ మంత్రి ఆళ్లనాని పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఆ తర్వాత ఏలూరు మేయర్ నూర్జహాన్, మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అలాగే మరికొందరు కీలక నేతలు కూడా అదేదారిలో నడిచారు. తాజాగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ దంపతులు టీడీపీలోకి వచ్చారు వైఎస్సార్‌సీపీకి ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావులు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు కూడా పదవితో పాటూ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలసిందే.. వీరంతా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading