నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్.
నరసరావుపేట:-
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ అధ్యక్షతన నరసరావుపేట రాధాకృష్ణ కళ్యాణ మండపం నందు న్యాయ నిపుణులతో పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి న్యాయ సహకార సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమం నందు ప్రముఖ న్యాయ నిపుణులు మరియు పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్ కు కొత్త చట్టాలు BNS కు సంబంధించి చేయవలసిన మరియు చేయకూడని వివిధ పనుల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది కేసు రిజిస్టర్ చేసిన తరువాత మరియు చార్జిషీట్ వేసే సమయంలో కోర్టు నందు ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించి కోర్టు నందు నడుచుకోవాలో అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం నందు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన PP లు మరియు APP లు 39 మంది పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డిప్యుటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మధుసూదన్ రావు కి దుస్సాలువా కప్పి, మెమోంటో అందించి పల్నాడు జిల్లా ఎస్.పి ఘనంగా సన్మానించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.