నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ పట్టణంలోని శివాలయంలో సామూహిక దీపారాధన పూజ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జరిగిన అపశృతికి గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. సామూహికంగా దీపారాధన కార్యక్రమం చేపట్టిన గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ నాయకులు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జరిగిన అపశృతికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా..
ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదేవెంకటేశ్వరావు సూచనల మేరకు… గురజాల నియోజవర్గ శాసనసభ్యులు యరపతినేనిశ్రీనివాసరావు సారధ్యంలో… జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టిరమేష్_బాబు ఆధ్వర్యంలో…పిడుగురాళ్ళ పట్టణంలోని స్థానిక శివాలయం దేవస్థానంలో సామూహిక దీపారాధన పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.