నారద వర్తమాన సమాచారం
ఏపీలో విధులు నిర్వహించనున్న కమిషనర్ ఆమ్రపాలి?
తెలంగాణ
రాష్ట్ర విభజన తర్వాత సివిల్ సర్వీసు అధికారుల కేటాయింపు కోసం ఖండేకర్ కమిటీని నియమించారు. ఆ కమిటీ నిబంధనల ప్రకారం విభజించింది. అయితే ఆ నివేదికలో పేర్కొన్న పలువురు తమ క్యాడర్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రాని కి,క్యాట్కు దరఖాస్తుకు పెట్టుకున్నారు..
ఏపీకి కేటాయించిన ఎక్కువ మంది తాము తెలంగాణ స్థానికతతో ఉన్నామని తమకు తెలంగాణ క్యాడరే కావాలని ఉండిపోయారు. అలాంటి అధికారి అయిన సోమేష్ కుమార్ ఏపీలో సీఎస్గా ఉండగా కోర్టు ఏపీకి వెళ్లాల్సిదేనని స్పష్టం చేసింది.
దాంతో ఆయన తెలంగాణ నంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అమ్రపాలికి కూడా దాదాపుగా అదే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న ఆమె ఉన్న పళంగా ఏపీలో రిపోర్టు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









