నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా విద్యార్దులకు, పోలీసు సిబ్బందికి వ్యాస రచన పోటీలు నిర్వహించిన పోలీస్ అధికారులు.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు IPS ఆదేశాలమేరకు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పలు స్కూళ్లలో మరియు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు పోలీసు సిబ్బందికి సైబర్ క్రైమ్ నేరాలు నియంత్రణలో యువత పాత్ర మరియు ప్రస్తుత సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లుఅనే* అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలలో నుండీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు.
విద్యార్ధిని, విద్యార్దులలో ఉన్న ప్రతిభను వెలికితీయు ఉద్దేశ్యంతో, వీరికి పోలీస్ శాఖ పట్ల పూర్తి స్ధాయిలో అవగాహన కల్పించుట మరియు పోలీస్ శాఖ పట్ల మంచి దృక్పథం, స్ఫూర్తి కల్పించే సదుద్దేశంతో ఈ కార్యక్రమమును జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.
ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్న తరుణంలో వాటిని నియంత్రించేందుకు యువత అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా తన జీవితాలు కాపాడుకోవాలని మరియు సమాజ శ్రేయస్సు, భద్రతల కోసం పోలీసులు అందిస్తున్న సేవలు, త్యాగాలను వివరించారు.
పోలీసుల సేవలు, దైనందిన విధులు, త్యాగాలు పట్ల అవగాహన చేసుకోవడం,గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం
పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.