నారద వర్తమాన సమాచారం
క్రోసూరు :-
జాతీయ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు, నడక, ప్రదర్శన
గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో ఎర్రబాలెంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నడక ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య అధికారులు ధనుష్ సిరి చందన మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించి వైద్య చికిత చేస్తే త్వరితగతిన నయమవుతుందని వారు పేర్కొన్నారు ఎర్రపాలెంలో జరిగిన అవగాహన సదస్సులో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ధనుష్ మాట్లాడుతూ క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలటానికి కారణాలవుతున్నాయన్నారు ఈ సందర్భంగా వైద్యాధికారిని సిరి చందన మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు దీనిపై ప్రభుత్వం వారు అవగాహన కల్పించి ఉచితంగా 18 సంవత్సరములు నిండిన మగవారికి ఆడవారికి స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబోతున్నట్లు ఆమె తెలిపారు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం భయం, సామాజిక అపోహలు, ఆర్థిక పరిస్థితులు కేసులు పెరగటానికి కారణం అవుతున్నాయన్నారు 12 ఏళ్ల కంటే ముందే రజ స్వల అయినవారు, పిల్లల లేని మహిళలు, ఊబకాయం ఉన్న మహిళలు, మద్యము, పొగాకు త్రాగేవారికి అధికంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధ్యయనాల్లో తేలిందన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని, అవగాహన, అప్రమత్తత, ముందస్తు గుర్తింపు, స్వీయ పరీక్ష, స్క్రీనింగ్ ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు అని అన్నారు ఆరోగ్య సంరక్షణలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ప్రతిరోజు జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు శివుడు అమర జ్యోతి ప్రభావతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజిని ఆరోగ్య కార్యకర్త స్వప్న స్టాఫ్ నర్స్ రాణి తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.