నారద వర్తమాన సమాచారం
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు, మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో పాల్గొని, నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో యరపతినేని శ్రీనివాసరావు నారా రామ్మూర్తి నాయుడు తో ఉన్న అనుబంధాన్ని,మిత్రత్వాన్ని గుర్తుచేసుకున్నారు. 1994లో నారా రామ్మూర్తి నాయుడు మరియు యరపతినేని శ్రీనివాసరావు శాసనసభ్యులుగా ఎన్నికై, ఆ కాలంలో వారిద్దరి మధ్య ఏర్పడిన సన్నిహిత సంబంధం రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని గుర్తుచేశారు. తమ రాజకీయ ప్రస్థానంలో వారు అనేక అనుభవాలను పంచుకొని, ప్రజాసేవకు నడకగా నిలిచిన అనుభవాలను చంద్రబాబు తో యరపతినేని స్మరించుకున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.