నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా కారంపూడి నందు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న పల్నాటి వీరుల ఉత్సవాలు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
900 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన పల్నాటి వీరుల ఉత్సవాలు సందర్భంగా ఈరోజు మూడవ ఘట్టంగా పిలవబడే మందపోరు (చాపకూడు) కార్యక్రమ బందోబస్తు ఏర్పాట్లను పల్నాడు జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది రేపు అనగా ది.03.12.2024 వ తేదీ మంగళవారం రోజున జరుగు
కోడిపోరు కార్యక్రమం మరియు ది.04.12.2024 వ తేదీన జరుగు కల్లిపాడు కార్యక్రమాలకు సంబంధించి పోలీసు శాఖ తీసుకోవలసిన చర్యల గురించి ఎస్పీ స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. అంకాలమ్మ ఆలయం వద్ద భక్తులు పొంగళ్ళు సమర్పించడానికి వచ్చినప్పుడు మరియు కొణతాల ఊరేగింపు సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని ఎస్పీ గురజాల సబ్ డివిజనల్ ఆఫీసర్ జగదీష్ ని ఆదేశించారు. వీర్ల తిరునాళ్ల సందర్భంగా కారంపూడి నందు భక్తుల కు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందనిఎస్పీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.