నారద వర్తమాన సమాచారం
శ్రీనగర్ గ్రామంలో రైతు ఆత్మహత్య
ఈరోజు తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో, అశం లింగారెడ్డి (38 సంవత్సరాలు), S/o వెంకటరెడ్డి, శ్రీనగర్ గ్రామం, దాచేపల్లి మండలం, తన అద్దె ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుడు వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవారు. అప్పుల భారం తట్టుకోలేక ఈ ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ నిద్రలో ఉన్న సమయంలో, చివరి గదిలో ఉరివేసుకుని త్య చేసుకున్నారు.
మూడేళ్ల క్రితం రామాపురం గ్రామం నుంచి శ్రీనగర్ గ్రామానికి మారి, అద్దె ఇంట్లో నివాసం ఉండి, వ్యవసాయ పొలాలు కౌలు తీసుకుని సాగుచేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే, మితిమీరిన అప్పులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.