నారద వర్తమాన సమాచారం
శిఖా శాంసన్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ
సంఘ సేవకుడు శిఖా శాంసన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు లోని అనంతవరం రోడ్డులో గల ఎస్ టి కాలనీ నందు వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంసన్ అందరికీ ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు శాంసన్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని, ప్రేమ, కరుణ, దయ , నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అనేవి క్రీస్తు మార్గం అని పేర్కొన్నారు క్రైస్తవులు సమాజంలో దీనులైన వారికి దానధర్మాలు చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పండ్లు కేకులు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రిక, సలోమాను తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.