నారద వర్తమాన సమాచారం
హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు
సోమవారంఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వీరికి మెజిస్ట్రేట్ అప్పటికప్పుడే బెయిల్ మంజూరు చేశారు.
ఒక్కొకరికి రూ.10వేల పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినవారిలో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఉన్నారు. నిందితులపై బీఎన్ఎ ఎస్ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా, సంధ్య థియేటర్లో పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందన సరిగా లేదని ఓయూ జేఏసీ పేరిట పలువురు ఆయన ఇంటిపై ఆదివారం దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు వేయడంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.