Sunday, July 13, 2025

పోలీసు విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్.,

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్.,

పల్నాడు జిల్లా పరిధిలో ఈరోజు (31.12.2024) పదవి విరమణ సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పదవి విరమణ చేసిన ఎస్సై 962 K. సాయి రెడ్డి, పెదకూరపాడు పోలీస్ స్టేషన్ ని మరియు ARSI 9555 B. వెంకటేశ్వర రెడ్డి, DAR ని, బొందిలి నరసింహ బాన్ సింగ్ 503 కానిస్టేబుల్ ఈపురు పీస్ ను వారి కుటుంబ సభ్యులతో కలిపి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., సాలువ కప్పి ఘనముగా సన్మానం చేసి పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేసినారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… వీరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడినారు. వారి భావి జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో తూలతూగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు. మరియు పదవి విరమణ పొందిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏ అవసరం ఉన్నా సరే స్వయంగా వచ్చి తనను కలవచ్చని భరోసా ఇచ్చినారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు AR డి.ఎస్.పి మహాత్మా గాంధీ రెడ్డి ఆర్ఐ వెల్ఫేర్ గోపీనాథ్  ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ T.మాణిక్యాల రావు మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading