నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా,నరసరావుపేట
సాయి సాధనా చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆర్థిక మోసం కేసు నమోదు
నరసరావుపేట I టౌన్ పోలీస్ స్టేషన్ లో సాయి సాధనా చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులపై మొత్తం పెట్టుబడిదారులను మోసం చేసినందుకు క్రైమ్ నెం. 22/2025 కింద కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదుదారు వెలూరి సుబ్బా రెడ్డి ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా, పాలడుగు పుల్లారావు (మేనేజింగ్ డైరెక్టర్) మరి కొందరు భాగస్థులు పై కేసు నమోదు చేసినారు. ఫిర్యాది మరియు అనేక మంది పెట్టుబడిదారులు చిట్ ఫండ్ పాలిసీలలో నిధులు చెల్లించినా, నిర్వాహకులు చిట్టీల వేలం నిర్వహించకుండా సేకరించిన మొత్తాన్ని అక్రమంగా దుర్వినియోగం, మోసం చేసి పారిపోయారు.
పెట్టుబడిదారులు నిధులు పెట్టే ముందు జాగ్రత్తలు పాటించాలని, మోసపోతున్నట్లు అనుమానం ఉన్న పక్షంలో నరసరావుపేట I టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ప్రజలకు సూచించబడింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.