నారద వర్తమాన సమాచారం
అమెరికా నుంచి భారతీయుల గెంటివేత.. 205 మందితో అమృత్సర్లో విమానం ల్యాండింగ్!
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్ సర్కార్.
చరిత్రలోనే తొలిసారిగా మిలటరీ విమానాల్లో అక్రమ వలసదారులను, వారివారి దేశాలకు తరలిస్తోంది.
ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా లేటెస్టుగా 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది.
టెక్సాస్ నుంచి అమెరికా సీ-17 మిలటరీ విమానంలో వాళ్లను భారత్కు తరలించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్నవాళ్లను స్వదేశానికి తరలిస్తున్నారు.
తొలి దశలో 20వేల మంది భారతీయులను వెనక్కి పంపించేందుకు అమెరికా రెడీ అయ్యింది.
అమెరికాలో 7 లక్షల 25 వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. అమెరికాలో మనవాళ్లు మూడో అతి పెద్ద ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సమూహంగా ఉన్నారు. వీళ్లతో పాటు ఇక అమెరికాలో శరణు కోరే శరణార్థులకు కూడా, ఈ గెంటివేతల కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వడం లేదు. అంతా బ్యాక్ టు భారత్ అనాల్సిందే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అయితే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తరువాతే వాళ్లను వెనక్కి పంపాలని నిర్ణయించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.