నారద వర్తమాన సమాచారం
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జాతీయ రహదారిపై భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది.
అవనిగడ్డ మండలం పులిగడ్డ టోల్ గేట్ సమీపంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక వాహన తనిఖీలు చేశారు. విజిలెన్స్ వారికి అందిన సమాచారం
మేరకు మచిలీపట్నం నుంచి హైవే మీదుగా కర్ణాటక, హిందూపురం వైపు వెళుతున్న రెండు లారీలు
అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని అడ్డుకుని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించారు
రెవిన్యూ, పీడీఎస్ అధికారులు వాటిని పరిశీలించి ఒక లారీలో ఉన్న 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరొక లారీలో సీఎంఆర్ బియ్యం ఉన్నట్లు వాహనదారుడు రికార్డ్ చూపగా, వాటిని తనిఖీకి పంపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.