నారద వర్తమాన సమాచారం
కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు హాజరై బుధవారం పవిత్ర త్రివేణి సంఘంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం అక్కడ ఘాట్లలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నిరుపేదల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రజా ప్రభుత్వం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు. మహా కుంభమేళా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కుంభమేళాలో పుణ్య స్నానాలను ఆచరించేందుకు దేశవ్యాప్తంగా తరలివస్తున్న కోట్లాదిమంది భక్తులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.