నారద వర్తమాన సమాచారం
నేడు తిరుపతికి చంద్రబాబు…టెంపుల్ ఎక్స్ పో కు హాజరవుతున్న మూడు రాష్ట్రాల సీఎంలు – ఆలయాలపై చర్చ, వర్క్ షాప్
సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వెళ్లనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నిర్వహిస్తోన్న టెంపుల్ ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. 17 నుంచి 19 వరకూ మూడు రోజులపాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్ పో జరగనుంది. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ముగ్గురూ సదస్సును ప్రారంభిస్తారు.
పటిష్ట భద్రత
టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ -2025కు సీఎం చంద్రబాబు సహా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.