నారద వర్తమాన సమాచారం
నరసరావుపేటలో లీగల్ మెట్రాలజీ, విజిలెన్స్ కమిటి ఆధ్వర్యంలో దుకాణాలపై మెరుపు దాడులు
పల్నాడు జిల్లా, నరసరావుపేట :
లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. స్థానిక మల్లమ్మ సెంటర్ లోని దుకాణాలలో ప్యాకెడ్ కమెడిటీస్ యాక్ట్ ప్రకారం ముద్రలు సక్రమంగా వున్నది లేనిది, తయారీ తేదీ, గడువు మరియు ముగియు తేదీ, తయారీదారుని పూర్తి చిరునామా, కస్టమర్ కేర్ నంబర్, ఎం.ఆర్.పి. మొదలగునవి సక్రమంగా ముంద్రించినది లేనిది తనిఖీ చేశారు. షాపులో ఉన్న బస్తాల బరువు బస్తాపై ముద్రించి వున్న బరువుతో సరిపోతుందో లేదో తనిఖీ చేశారు. తూనికలలొ తేడా వున్న షాపులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ మీడియతో మాట్లాడుతూ ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర సివిల్ సప్లయస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ ప్రాంతాలలో తనికీలు నిర్వహించి నిబంధనలు పాటించని కంపెనీలపై మరియు షాపులపై కేసులు రాయించడం జరిగిందని, అందులో భాగంగా నరసరావుపేట పట్టణంలో తనిఖీలు నిర్వహించామని, త్వరలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలసి అన్ని హోటల్స్ మరియు రెస్టారెంటులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ పల్నాడు జిల్లా ఇన్స్పెక్టర్ డి.శివశంకర్, పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం సభ్యుడు నాగెండ్ల వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.