నారద వర్తమాన సమాచారం
బొల్లాపల్లి తహశీల్దార్ ఆఫీస్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే
పల్నాడు జిల్లా,
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ఆకస్మిక తనిఖీ చేశారు.
కార్యాలయంలో ఉన్న తహశీల్దార్ తో మాట్లాడారు, కార్యాలయం లో రికార్డులను పరిశీ లించారు. సిబ్బంది టైం కి తప్పనిసరిగా రావాలని, ప్రతి ఒక్కరూ అన్ని రికార్డులను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం లో ఎవరు అలసత్వం ప్రదర్శించిన సహించ బోమని హెచ్చరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ను తప్పనిసరిగా ప్రజలకు అమలు చేయాలని పిలుపు నిచ్చారు.
ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దని, సంక్షేమ పథకాలకు సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు, విద్యార్థులకు, రైతులకు, గ్రామ ప్రజలకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకో వాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.