నారద వర్తమాన సమాచారం
డ్వాక్రా మహిళలకు శుభవార్త
▪️ పిల్లల చదువులు, పెళ్లికి 5% వడ్డీతో రూ.లక్ష రుణం
▪️ మహిళా దినోత్సవం రోజున ప్రారంభం!
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. వారి పిల్లల చదువులు, వివాహ అవసరాలకు 5 శాతం వడ్డీతోనే రూ. లక్ష వరకు రుణాన్ని అందించనుంది. చాలామంది పేదలు వారి బిడ్డల చదువులు, వివాహాలకు బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి అవస్థలు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. వారికి ఆర్థిక భరోసానివ్వాలని నిర్ణయించింది. ఈ పథకం మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు ప్రారంభించగా, సీఎంవో ఆమోదం తెలిపింది. మార్చి 8న మహిళా దినో త్సవం రోజున లేదా మరో తేదీన సీఎం చేతులు మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు.
స్త్రీనిధి ద్వారా అమలు
ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలున్నారు. ఈ పథకానికి ఏటా రూ.1,000 కోట్లు కేటాయించనున్నారు. అంటే రానున్న నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళిక రచించారు. నిధుల సమీకరణపై సెర్చ్ అధికారులు కసరత్తు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.