నారద వర్తమాన సమాచారం
24న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
▪️ అదే రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బోర్డు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. తొలుత ఈ నెల 8వ తేదీన సమావేశాన్ని నిర్వహించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ పరిపాలనా కారణాలతో 24వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ప్రధానంగా 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.