నారద వర్తమాన సమాచారం
ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ద్వారా పిడి కేసులు పెడతాం: ఢిల్లీలో సిఎం చంద్రబాబు
ఏపీ సిఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “ఇవాళ రెండు కీలక సమావేశాలు జరిగాయి. రాజకీయ పరిణామాల గురించి హోంమంత్రి అమిత్ షాతో చర్చించాం. ఎన్డీయే మున్ముందు ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరిగింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించాం. భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయి. గతంలో అధికారులు, నాయకులు కలిసిపోయారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఈలో చేర్చారు. అటవీ భూములను కూడా ఆక్రమించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారు. ఏపీ శాసనసభ, మండలి ముందుకు ఈ బిల్లు వచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని కోరాం. ఈ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ కేసులు పెడతాం. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నాం” అని చంద్రబాబు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







