నారద వర్తమాన సమాచారం
మా గ్రామం మునగదా..?భీమవరం గ్రామస్తుల సూటిగా ప్రశ్న
కూనవరం :-
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్బంగా కొనసాగిస్తున్న యాత్రకు భీమవరం గ్రామస్తులు తమ గోడు చెప్పుకొచ్చారు.2022 గోదావరి కి గ్రామంలోని ప్రతి ఇల్లు మునిగిందని అయినా తమ గ్రామాన్ని ప్రభుత్వం మరియు అధికారులు ఆర్ అండ్ ఆర్ గ్రామంగా గుర్తించడంలేదని అన్నారు. భీమవరం గ్రామాన్ని కూడా 41 కాంటూరు లో కలపాలని విజ్ఞప్తి చేసారు.అలాగే ప్రజా చైతన్య యాత్ర పర్యటించిన ప్రతి గ్రామంలోని నిర్వసితులు తమ గ్రామాలను 41కాంటూరు లో కలిపి అందరికి న్యాయం చేయాలని యాత్ర దృష్టికి తీసుకొచ్చారు. అయ్యవారిగూడెంలో ముంపుకి గిరి అవుతున్న భూములకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లోజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సున్నం రాజులు,సీపీఎం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాయం సీతారామయ్య పంకు సత్తిబాబు, పొడియం శ్రీరాంమూర్తి, కే. సత్తిబాబు సర్పంచ్ బొగ్గా వెంకమ్మ,తాళ్లూరి శ్రీనివాసరావు,మడెం బాబు,సుమన్, దేవి, కుమారి, సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.