నారద వర్తమాన సమాచారం
తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలలో ప్రధానమైనది తిరుపతి లడ్డు…..
తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు Patent లభించింది. దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు.
లడ్డు యొక్క రుచిని బట్టి చూసి ఇది తిరుపతి లడ్డు కాదనీ, అదే ప్రసాదమయితే ఇది వేంకటేశ్వర స్వామి దివ్యమధుర ప్రసాదమని చెప్పగలము. తిరుపతి లడ్డుకు రుచి రావటానికి కారణం ఏమిటంటే స్వామికి నైవేద్యం పెట్టడం ప్రథమ కారణమయితే, ఆలయంలో ఉన్న బంగారం బావి నీటితో లడ్డూ, మిగితా నైవేద్యాలను తయారుచేయడం ద్వితీయ కారణం. తిరుపతిలో ఎన్నో అద్భుత వన మూలికలున్నాయి. బంగారు బావి నీటితో చెయ్యటం వల్ల తిరుపతి లడ్డుకి రుచి వస్తుంది.
లడ్డూ రకాలు:
ఆస్ధానం లడ్డూ – ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో తయారుచేస్తారు.
కళ్యాణోత్సవ లడ్డూ – కల్యాణోత్సవం సేవలో భక్తులకూ ఈ లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు.
ప్రోక్తం లడ్డూ – వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.