నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో పాల్గొనటం జరిగింది. అనంతరం గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 39 మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు రూ.35,36,587/-(ముప్పై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనబై ఏడు) రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.